Thu Dec 18 2025 07:28:40 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఈరోజు తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 343 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 343 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,54,879 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 86,415 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాల సంఖ్య..
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,26,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,76,869 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,35,99,96,267 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

