Mon Feb 02 2026 14:46:51 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 6,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 6,822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,40,69,608 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 95,014 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వ్యాక్సినేషన్...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,48,383 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,73,757 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,28,76,10,590 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
- Tags
- corona viurs
- inda
Next Story

