Sat Dec 06 2025 20:03:06 GMT+0000 (Coordinated Universal Time)
India : భారత్ లో స్వల్పంగా పెరిగన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 15,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 278 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,21,89,887 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టెస్ట్ ల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,64,522 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,28,37,473 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,12,622 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,75,37,22,697 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

