Sun Feb 01 2026 21:35:56 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి యాభై వేలకు దిగువన కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 684 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,15,85,711 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 5,37,045 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ : 4,26,31,421 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,08,665 మంది మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,72,81,49,447 మందికి కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
Next Story

