Mon Feb 02 2026 14:45:05 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో నేడు బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 7,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు కొత్తగా 7,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 236 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,22,037 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,13,584 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు....
భారత్ లో ఇప్పటి వరకూ 3,39,46,749 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,66,147మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,17,63,73,499 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

