Sat Dec 06 2025 17:44:22 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 5,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 158 మంది మరణించారు.

ఇండియా : భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 5,476 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 158 మంది మరణించారు. .ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,88,475 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 59,442 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,62,953 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,036 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,78,83,79,249 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

