Sat Jan 31 2026 10:35:05 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్... మరణాలు కూడా
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 477 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 477 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,40,08,183 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,763 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,06,541మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,69,724 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,24,96,515 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

