Wed Jan 28 2026 23:51:58 GMT+0000 (Coordinated Universal Time)
ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందు శశి థరూర్ కీలక వ్యాఖ్యలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందుగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల ముందుగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఎంపీలు తప్పకుండా తమకు ఓటు వేస్తారని చెప్పారు. అయితే, ఎన్డీఏ మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య సంఖ్యలో తేడా ఉన్నదని ఆయన అంగీకరించారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూతాము తమ ఓట్లు వేస్తామని, ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. లెక్కలు ఎలా సాగుతున్నాయో అందరికీ తెలుసునని, అంతకు మించి తాను ఏమి చెప్పగలను అని వ్యాఖ్యానించారు.
తమదే గెలుపంటూ...
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి ఎస్.పీ. సింగ్ బఘేల్ మాత్రం ఎన్డీఏ అభ్యర్థి సీ.పి. రాధాకృష్ణన్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు అభ్యర్థులు, వారి అనుచరులు వారి ఓట్లతో అనుకూలతమై విశ్వాసం వ్యక్తం చేస్తును్నారని, ఎన్డీఏ కి సంఖ్యాబలం ఎక్కువని రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా అవుతారని తెలిపారు. తాము ఆయనకు అనుకూలంగా ఓటు వేస్తామని, ఎన్డీఏ గెలుస్తుందని అని ఆయన అన్నారు.
Next Story

