Fri Mar 20 2026 08:21:58 GMT+0530 (India Standard Time)
Karntaka Mandya బ్రేకింగ్: అట్టుడుకుతున్న కర్ణాటకలోని ఆ ప్రాంతం
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ పట్టణంలో

కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దుకాణాలు, వ్యాపారాలకు ఒక వర్గం నిప్పు పెట్టడంతో గొడవలు మరింత తీవ్రమయ్యాయి. బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా వెళ్తున్నారు. నాగమంగళలోని ప్రధాన రహదారిపై ఊరేగింపు వెళుతుండగా, మసీదు దగ్గర నుంచి వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొందరు వ్యక్తులు దుకాణాలను ధ్వంసం చేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. హిందూ సంఘాలు ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. పోలీసులు ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 విధించారు. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను విశ్లేషిస్తూ ఉన్నారు. కొందరు ఇష్టానుసారం రాళ్లు విసరడం వైరల్ వీడియోలో చూడొచ్చు.
Next Story

