Sun May 19 2024 10:44:41 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన రాహుల్
పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా చరణ్ సింగ్ చన్నీ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు
పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఖరారయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం చరణ్ జిత్ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హైకమండ్ చరణ్ జిత్ సింగ్ చన్నీని నియమించింది. ఎన్నికలకు ఏడాది ముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పంజాబ్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఆన్ లైన్ లో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది.
చన్నీకే జై కొట్టడంతో...
ఎక్కువ మంది చరణ్ జిత్ సింగ్ చన్నీ కే జై కొట్టారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా పోటీ పడుతున్నారు. ఇద్దరితో చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి అభ్యర్థిని రాహుల్ గాంధీ ప్రకటిచారంటున్నారు. అయితే సిద్ధూను కాదని చరణ్ జిత్ సింగ్ చన్నీని రాహుల్ గాంధీ అభ్యర్థిగా ప్రకటించడంతో సిద్దూ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో ఉంది.
Next Story