Sat Mar 07 2026 17:58:03 GMT+0530 (India Standard Time)
కేంద్రం మరో షాక్.. ఆ రాయితీలు నిల్
కేంద్ర ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుంది. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుంది. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది. సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ ధరలపై రాయితీలను ఇచ్చేందుకు విముఖత చూపింది. రైల్వే టిక్కెట్ ధరలపై కేంద్రం సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఇచ్చేది. అయితే కరోనా నేపథ్యంలో రాయితీలు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా...
కోవిడ్ నెలకొన్న పరిస్థితుల్లో అన్ని రాయితీలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ వినిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించకోవడం లేదు. గతంలో ఉన్న రాయితీలను తాము కొనసాగించేందుకు సిద్ధంగా లేమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Next Story

