Mon Dec 15 2025 08:19:46 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం లేదు
భారత్లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది

భారత్లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది.సింగపూర్లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP.2 వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే దాని ప్రభావం దేశంలో లేదని చెప్పింది.
సింగపూర్ లో వచ్చిన...
సింగపూర్ లో వచ్చిన వేరియంట్ భారత్ లో వచ్చే అవకాశం లేదని, ప్రజలను భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోనే ఈ కొత్త వేరియంట్లో దాదాపు 91 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్లు ధరించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
Next Story

