Wed Jan 28 2026 17:28:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విద్యార్థులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు షాక్ ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇకపై నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో పాస్ కాకున్నా హాజరుతో పై క్లాస్ కు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. అది కొన్ని దశాబ్దాల నుంచి అమలులో ఉంది.
నో డిటెన్షన్ విధానాన్ని...
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో ఇక ఆ అవకాశం ఉండదు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే పై క్లాస్ కు అనుమతించరు. అయితే మరో సారి రెండు నెలల్లో పరీక్ష నిర్వహిస్తారు. అప్పటికీ పాస్ కాకపోతే అదే తరగతి చదవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్క్ష్ంతో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులను ఫెయిల్ చేసినట్లే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

