Wed Dec 17 2025 14:13:24 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీతో పాటు అనేక మంది రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆరోపణలు రావడంతో...
2024 లోక్ సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పై రాహుల్ గాంధీతోపాటు ఇండియా కుటమిలోని అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ పై ఈ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ లోని ఓటరు రోలింగ్ నెంబర్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఓటింగ్ కు సంబంధించి, ఓటింగ్ శాతానికి సంబంధించి పారదర్శకంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.
Next Story

