Tue Jan 20 2026 13:32:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. దీపావళి కానుక
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుతీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలుతీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు 10.30 గంటలకు సమావేశమైనకేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగులకు డీఏ మూడు శాతాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ లభించనుంది.
పలు కీలక నిర్ణయాలు...
దీంతో పాటు కేంద్ర మంత్రి వర్గం పలుకీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగులతో పాటు రైతులకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. కేబినెట్ భేటీ వివరాలను మధ్యాహ్నం మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించనున్నారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను తెలపనున్నారు.
Next Story

