Fri Dec 05 2025 21:37:44 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షా పాల్గొననున్నారు.

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఇప్పటికే తొలి విడత జాబితాను విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ నేడు జరిగే సమావేశంలో రెండో విడత జాబితాపై చర్చించనున్నారు. రెండో విడత లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
రెండో జాబితా విడుదలకు...
రానున్న ఎన్నికల్లో 400 లోక్సభ స్థానాలను లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో పొత్తులను కూడా ఖరారు చేసుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు వదిలేసిన సీట్లను మినహాయించి మిగిలిన సీట్లలో కొత్త అభ్యర్థులను ప్రకటించేందుకు నేడు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండో జాబితాలో సీనియర్ నేతల పేర్లు ఎక్కువగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

