Mon Mar 16 2026 02:59:38 GMT+0530 (India Standard Time)
బీజేపీ ఎంపీ కన్నుమూత
భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు రతన్ లాల్ కటారియా మృతి చెందారు

భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు రతన్ లాల్ కటారియా మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు చండీగఢ్లోని ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. రతన్ లాల్ కటారియా బీజేపీలో సీనియర్ పార్లమెంటు సభ్యుడు.
మూడు సార్లు ఎంపీగా...
ఆయన ఇప్పటికి మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. 1951లో రతన్ లాల్ కటారియా జన్మించారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు
Next Story

