Sun May 12 2024 13:13:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ మేనిఫేస్టో విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫోస్టోను నేడు విడుదల చేయనున్నారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫోస్టోను నేడు విడుదల చేయనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫేస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడ్యూరప్ప పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ అంశాలే...
ఈ నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఏమేం చేయనున్నామో ప్రజలకు చెప్పనుంది. యువత, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళ సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారని చెబుతున్నారు.
Next Story