Thu Dec 18 2025 07:33:33 GMT+0000 (Coordinated Universal Time)
తొలి జాబితాను విడుదల చేసిన మాయావతి
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధమవుతుంది. మయావతి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధమవుతుంది. ఆ పార్టీ అధినేత్రి మయావతి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈరోజు మాయావతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తొలి విడతగా 53 అసెంబ్లీ స్థానాలకు మాయావతి అభ్యర్థులను ప్రకటించారు.
53 స్థానాలకు....
యాభై మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది తొలి విడత ఎన్నికలకు జరుగుతున్న స్థానాలకు మాత్రమే. వంద మంది అభ్యర్థుల వరకూ ప్రకటిస్తారని భావించినా ఆమె 53 మందినే ప్రకటించారు. యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మొత్తం 403 స్థానాల్లో 53 మందిని మాత్రమే ప్రకటించారు. ఇంకా 350 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Next Story

