Fri May 23 2025 02:54:57 GMT+0000 (Coordinated Universal Time)
America : నేటి నుంచి నాలుగు రోజులు అమెరికా ఉపాధ్యక్షుడి భారత్ పర్యటన
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలపై సుంకాలు పెంచిన తరుణంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురూ అమెరికా విధించిన సుంకాలపై చర్చించే అవకాశముందని అంటున్నారు. దీంతో పాటు అంతర్జ్జాతీయ పరిణామాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇరువురు చర్చించే అవకాశముందని తెలిసింది.
మోదీ విందు...
దీంతో పాటు జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా విందును ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం ఇటలీ నుంచి ఉషా వాన్స్ తో పాటు లిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్ లతో కలసి జేడీ వాన్స్ భారత్ కు చేరుకోనున్నారు. పాలం ఎయిర్ బేస్ కు రానున్న వారికి భారత ప్రభుత్వం నుంచి ప్రతినిధులు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో వీరి భేటీ జరగనుంది. వాన్స్ తో పాటు కొందరు అధికారులు కూడా రానున్నారు. మంగళవారం రాజస్థాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story