Sun Dec 14 2025 11:31:26 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఏనుగు ఆస్తి ఐదు కోట్లు
బిహార్ జానుర్కు చెందిన అక్తర్ ఇమామ్ తను పెంచుకున్న ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తి రాసిచ్చాడు.

బిహార్ జానుర్కు చెందిన అక్తర్ ఇమామ్ తను పెంచుకున్న ఏనుగుల పేరిట ఐదు కోట్ల రూపాయల విలువైన ఆస్తి రాసిచ్చాడు. ఆయన రెండు ఏనుగులు పెంచుకుంటున్నారు. ఇటీవల ఓ ఏనుగు చనిపోవడంతో రాణి అనే ఏనుగు ఐదుకోట్ల ఆస్తికి ఏకైక వారసురాలైంది.
ఇమామ్ మరణించడంతో...
తన ఆస్తిని ఏనుగులకు రాసివ్వడం అక్తర్ ఇమామ్ ఫ్యామిలీకి నచ్చకపోవడంతో వారు కొంత ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలో అతడు 2021లో హత్యకు గురవ్వడం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. అక్తర్ ఇమామ్ చనిపోవడంతో వీలునామా ప్రకారం ఆస్తి రాణి ఏనుగుకు దక్కింది. ప్రస్తుతం రాణి ఏనుగు ఉత్తరాఖండ్ లోని రామనగర్ లో ఓ వ్యక్తి సంరక్షణలో ఉంది.
Next Story

