Ahmedabad Plane Crash: కూలిన విమానంలో మాజీ ముఖ్యమంత్రి
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది.మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. విజయ్ రూపానీ ఆ విమానంలో ప్రయాణిస్తున్నారన్న మీడియా కథనాలపై ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటన ఎటువంటి ది చేయలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసి ప్రమాదం గురించి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన గుజరాత్ కు బయలుదేరివెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలను వెంటనే ప్రారంభించారు. 1.17 నిమిషాలకు టేకాఫ్ అయిందని చెబుతున్నారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా విమానం కూలిపోయింది. మొత్తం సిబ్బందితో కలిసి 256 మంది వరకూ ఉన్నారు.

