Tue Jan 20 2026 18:16:29 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చేది కాంగ్రెస్ సర్కార్ : ఖర్గే
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఆ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కలసి వచ్చే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని వెళతామని చెప్పారు.
నూకలు చెల్లినట్లే...
మోదీ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లినట్లేనన్న మల్లికార్జున ఖర్గే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కారణంగా దేశంలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందన్న భావిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Next Story

