Sat May 24 2025 12:48:48 GMT+0000 (Coordinated Universal Time)
Mock Drill : సైరన్ మోగింది...దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్.... ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
భారత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ జరిగింది. సరిగ్గా నాలుగు గంటలకు సైరన్ మోగింది

భారత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ జరిగింది. సరిగ్గా నాలుగు గంటలకు సైరన్ మోగింది. దీంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సెక్యురిటీ మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం 244ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యుద్ధం వస్తే పౌరులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ప్రజల్లో తమను తాము రక్షించుకోవడంపట్ల అవగాహన కల్పించారు. విశాఖపట్నంలో రెండు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ను అధికారులు నిర్వహించారు.
హైదరాబాద్ లో మాక్ డ్రిల్...
హైదరాబాద్ లోనూ నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.. కంచన్ బాగ్ డీఆర్డీవో, మౌలాలిఎన్.ఎఫ్.సి, సికింద్రాబాద్, గోల్కొండ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయిన మాక్ డ్రిల్ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. . ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్ల ను ముందుగానే చేశారు. నాలుగు గంటలకు సైరన్ మోగిన వెంటనే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకుతరలి వెళ్లారు. ఇళ్లలో ఉండే వారు ఇళ్లలోనే ఉండిపోవాలని పోలీసులు తెలిపారు. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, వైద్యశాఖ, రెవెన్యు అధికారులు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమ ప్రాణాలు రక్షించుకోవాలో అవగాహన కల్పించారు.
Next Story