Sun Feb 01 2026 16:29:58 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ ముందంజలో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ముందంజలో ఉన్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ ముందంజలో ఉన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. అయితే మళ్లీ ముందంజలోకి మోదీ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ ఉన్నారు.
లోక్ సభ ఫలితాలు వస్తూ ఉండగా.. బీజేపీ ఢిల్లీ ఆఫీసులో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు, నాయకులకు పంచడానికి పెద్దమొత్తంలో స్వీట్లను సిద్ధం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతో కలిసి నాయకులు సంబరాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ కార్యకర్తల కోసం ఏర్పాట్లు చేశారు.
Next Story

