Tue Feb 03 2026 00:41:15 GMT+0000 (Coordinated Universal Time)
భారీవర్షాలకు కూలిన బతుకులు
రెండు ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడినం కారణంగా తెలంగాణ సహా.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు తాజాగా యూపీలో 12 మంది సజీవ సమాధి అయ్యారు. యూపీ రాజధాని లక్నోలోని దిల్ కుషా ప్రాంతంలో శుక్రవారం ఓ ఇంటి గోడ కూలడంతో 9 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
యూపీలోని మరో ప్రాంతంలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉన్నావోలో జరిగింది. ఈ రెండు ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాద ఘటనల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రేపటి వరకూ యూపీలో ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు యూపీలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దేశరాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది.
Next Story

