Mon Jan 19 2026 13:47:02 GMT+0000 (Coordinated Universal Time)
చార్ ధామ్ యాత్రకు వెళుతున్న వారికి అలెర్ట్
చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల ప్రాంగణంలోకి మొబైల్స్, కెమెరాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల వద్ద క్లోక్ రూమ్స్ ను ఏర్పాటు చేసింది. మొబైల్స్, కెమెరాలను ఇక ఆలయ ప్రాంగణంలోకి అనుమతించబోమని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
మొబైల్స్, కెమెరాలపై...
మొబైల్స్, కెమెరాలు డిపాజిట్ చేసి దర్శనం చేసుకునే అవకాశం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కల్పించింది. ఈ నిర్ణయంతో ఇక చార్ ధామ్ యాత్రలో మొబైల్, కెమెరాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెడుతుండటంతో పాటు ఆలయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఈ చర్యలకు ఉత్తరాంఖండ్ ప్రభుత్వం తీసుకుంది.
Next Story

