Thu Jan 01 2026 13:32:36 GMT+0000 (Coordinated Universal Time)
పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

పశ్చిమ బెంగాల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో తొలిసారి వందేభారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతుంది. కోల్ కత్తా - గౌహతిల మధ్య ఈ తొలి స్లీపర్ వందేభారత్ రైలు ప్రారంభంకానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ రైలు ఛార్జీలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు.
త్వరలో అందుబాటులోకి...
సంక్రాంతి పండగలోపే ఈ రైలు పశ్చిమబెంగాల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రానున్న పదిహేను నుంచి ఇరవై రోజుల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. త్వరలో ప్రధాని మోదీ ప్రారంభ తేదీ ఎప్పుడు ఉండేది ప్రకటిస్తారని తెలిపారు. వందేభారత్ స్లీపర్ రైలులో కోల్ కత్తా - గౌహతిల మధ్య ప్రయాణానికి ఆరువేల రూపాయలు టిక్కెట్ ధరను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు. విమాన ధరల కంటే ఇది తక్కువని, వేగంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చని,త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
Next Story

