Sat Jul 27 2024 05:47:30 GMT+0000 (Coordinated Universal Time)
కోదాడలో రేపు రైతు ఆత్మీయ సమ్మేళనం
కోదాడలోని గుడిబండలో రేపు రైతుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఎమ్మెల్యే బొల్లయ్య యాదవ్ తెలిపారు.
![bollaiah yadav, mla, kodada, raithu bandhu bollaiah yadav, mla, kodada, raithu bandhu](https://www.telugupost.com/h-upload/2022/01/08/1308642-bollaiah-yadav-mla-kodada-raithu-bandhu.webp)
కోదాడలోని గుడిబండలో రేపు రైతుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా నియోజకవర్గంలో రైతులకు యాభై వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని ఆయన తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి రైతు బంధు వారోత్సవాలు నిర్వహించామని తెలిపారు.
రైతు బంధు....
ఇందులో భాగంగా రేపు ఉదయం పది గంటలకు గుడిడబండలోని రైతు వేదిక లో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరవుతారని చెకప్పారు. కోదాడ మండలంలోని ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్ లు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. అధికారులు రైతు ఆత్మీయ సమ్మేళనంలో పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారని ఆయన చెప్పారు.
Next Story