Sat May 18 2024 18:52:54 GMT+0000 (Coordinated Universal Time)
సీక్వెల్తో శ్రీకారం చుడుతున్న జూ.అతిలోక సుందరి
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల ప్రధమ కుమార్తె జాహ్నవి కపూర్ వెండి తెరపై పరిచయం కాబోయే చిత్రం గురించి గత ఏడాది కాలంగా బొంబాయి లో పెద్ద చర్చే జరుగుతోంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు జాహ్నవి కపూర్ ని పరిచయం చెయ్యనున్నాయని కథనాలు వినిపించాయి. అవేవి జరగలేదు. అలాగని జాహ్నవి పరిచయ చిత్రాల పై కథనాలు ఆగలేదు. ఏ ఖర్చు లేకుండా ప్రచారం పొందుతున్న డెబ్యూ యాక్ట్రెస్ గా జాహ్నవి కెరీర్ కి ప్లస్ అవుతుంది అనుకున్నారో ఏమో శ్రీదేవి, బోనీ కపూర్ ల జంట ఈ వదంతులకు తెర దించే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు.
హే దిల్ హై ముష్కిల్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో వున్న బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన తదుపరి చిత్రంగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు. తొలి భాగంలో ఆలియా భట్ కథానాయికగా నటించగా సీక్వెల్ కి కూడా కరణ్ జోహార్ ఫ్రెష్ ఫేస్ అయితే బావుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు. ముందుగా ఈ చిత్రం ద్వారా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఖాన్ ని పరిచయం చేద్దాం అనుకున్న కరణ్ కు సారా తల్లి అమృత నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో కరణ్ జోహార్ జాన్వీ కపూర్ కోసం శ్రీదేవి ని సంప్రదించారు. శ్రీదేవి కరణ్ జోహార్ దర్శకత్వంలో జాన్వీ పరిచయం కావటానికి సుముఖంగా ఉన్నారనే సమాచారం. మరి ఈ కాస్టింగ్ ఫైనలైజ్ అయ్యి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Next Story