Wed Dec 24 2025 18:15:17 GMT+0000 (Coordinated Universal Time)
రాశిఖన్నాకు ప్రమోషన్ ఇస్తున్న చెర్రీ

ఆరెంజ్ చిత్రం లో రామ్ చరణ్ లవర్ బాయ్ గా కనిపించి పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఆ సినిమా చరణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా దెబ్బకు రామ్ చరణ్ ఇక లవర్ బాయ్ గెటప్స్ కి దూరం గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న ధ్రువ చిత్రం కంప్లీట్ కాగానే చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ చితం లో చరణ్ లవర్ బాయ్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. త్వరలోనే ముహూర్తం కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ చిత్రం తొంబైల్లోని పల్లెటూరి ప్రేమ కథగా ఉండ బోతుందని సమాచారం.
ఈ చిత్రం లో రామ్ చరణ్ కి జోడి గా ఒక హీరోయిన్ సెట్ చేశారని అంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు..... ఆమె మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం చిత్రం లో నటించిన రాశి ఖన్నా అట. ఈమెను ఈ చిత్రానికి చరణ్ కి జోడిగా ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాశి ఖన్నా సుకుమార్ చిత్రం కోసం ఆడిషన్ కూడా చేశారని చెబుతున్నారు. ఇక ఆల్మోస్ట్ రాశి ఖన్నా చరణ్ కి జోడిగా కన్ఫర్మ్ అయ్యిపోయిందని అంటున్నారు. ఇక ఇదే గనక నిజమైతే రాశికి అదృష్టం పట్టుకున్నట్లే. ఇప్పటివరకు స్టార్ హీరోలతో చెయ్యని రాశి ఇప్పుడు చరణ్ తో చెయ్యడం ఆమెకి పెద్ద విషయమే. అయితే రాశి ఖన్నా రామ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో చేసినా కేవలం రెండో హీరోయిన్ గానే చేసింది. మరి ఇప్పుడు చరణ్ సినిమా లో కూడా రాశి సింగిల్ హీరోయినా లేక మళ్ళీ వేరే హీరోయిన్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంటుందో అనేది తెలియాల్సి వుంది.
ఏది ఏమైనా కూడా చరణ్ తో కలిసి నటించే అవకాశం రావడం మాత్రం రాశికి మామూలు విషయం కాదు. ఇక చరణ్ పక్కన రాశి నటిస్తే పెద్ద హీరోల కళ్ళు ఆమెపై పడినా పడొచ్చు. సో ఒక విధం గా రాశి ప్రమోషన్ కొట్టేసినట్లే కదా.
Next Story

