Mon Dec 29 2025 18:57:35 GMT+0000 (Coordinated Universal Time)
మిసెస్ మహేష్ కు పొలిటికల్ ఆలోచన ఉందా?

ఈ మధ్యన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య బాగా హైలెట్ అవుతుంది. ఎలా అంటే ఆమె తన భర్త దత్తత తీసుకున్న గ్రామం బుర్రిపాలెం లో పర్యటిస్తూ అక్కడ జరిగే అభివృద్ధికార్యక్రమాలని పర్యవేక్షిస్తూ మీడియా లో కనబడుతుంది. అయితే ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా అయినప్పటికీ కొన్నాళ్ళు సినిమాల్లో హీరోయిన్ గా చేసి మహేష్ బాబుని పెళ్లాడిన తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక పెళ్ళి, పిల్లలు అంటూ ఆమె పూర్తిగా గృహిణి బాధ్యతలు చేపట్టింది. అయినా భర్త మహేష్ చేసే పనులకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనేది అటు రాజకీయ వర్గాలులో ఇటు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎలాగూ భర్త దత్తత గ్రామం లో సామాన్య ప్రజలతో మమేకాకమవుతూ, అక్కడి సమస్యలపై స్పందిస్తూ, ఎక్కువ శ్రద్ధను కనబరుస్తూ బాగా హైలెట్ అవుతుంది. ఇంకా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీలు కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక అక్కడ జరిగే విషయాలని ఎప్పటికప్పుడు మహేష్ కి చేరవేస్తూ యాక్టీవ్ గా ఉంటోంది. మహేష్ ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ గా ఉంటాడు అందుకే నమ్రత ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకుని మహేష్ కి హెల్ప్ చేస్తుంది.
అయితే ఇదంతా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే ఇలా పావులు కదుపుతోందని అంటున్నారు. ఇక ఎలాగూ మహేష్ బాబు నేను రాజకీయాలు కు దూరం గా ఉంటానని... పాలిటిక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడు. మరి నమ్రత కు ఇంట్రెస్ట్ ఉంది గనక.... ఇలా రాజకీయాల్లో తానూ ప్రజలకు సేవ చెయ్యాలని అనుకుంటుందేమో. అందుకే ఆమె పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చోపిస్తుందనేది ఒక వాదన. ఇక ఎలాగూ మహేష్ బావ గళ్ళ జయదేవ్ రాజకీయాల్లో మంచి పోసిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఎమన్నా నమ్రత కు రాజకీయ పరం గా ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడేమో మరి.
Next Story

