నోట్ల రద్దు ప్రభావం గురించి చింతలేని హీరో!
ఫిలిం తో చిత్రాలు నిర్మితమవుతున్న రోజులు అవి, పౌరాణిక కథలు తెరకెక్కించటానికి మాన్యువల్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం అమితంగా శ్రమించాల్సిన రోజులు అవి. ఆ రోజులలో కళాభినయం తెలిసిన దర్శకులు బాపు గారి దర్శకత్వం లో శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణం కేవలం 17 లక్షల వ్యయంతో నిర్మితమైనది. అప్పటి వరకు విడుదల ఐన తెలుగు చిత్రాలన్నిటితో పోలిస్తే సంపూర్ణ రామాయణం అధిక వ్యయంతో నిర్మించబడిన చిత్రం. ఇప్పటి తరంలో చిత్రీకరణ డిజిటల్ లో జరుగుతుండటం, వివిధ రకాల కెమెరాల వినియోగం సౌలభ్యంలోకి రావటం, విజువల్ ఎఫెక్ట్స్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసుకునే వెసులుబాటు రావటం వలన నిర్మాణ వ్యయం అదుపు కావాల్సింది పోయి దాదాపుగా 75 కోట్ల వ్యయానికి తెలుగు చిత్రాల(బాహుబలి మినహాయింపు) నిర్మాణం చేరింది.
దీనికి ప్రధాన కారణం హీరోలు, దర్శకుల పారితోషికాలు. హీరో మరియు దర్శకుడి పారితోషికాలు మాత్రమే పూర్తి నిర్మాణ వ్యయంలో మూడు వంతులు ఉంటుంది. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఆయన హీరోగా చేసిన చిత్రాలకు ఆయనే దర్శకత్వం చేసుకున్నారు. చాలా చిత్రాలు విజయం సాధించాయి కూడా. కానీ ఆయనకి ఇల్లు కానీ వాహనాలు కానీ ఏమి లేవు. సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని సినిమాల నిర్మాణానికి, నీరు లేని ప్రాంతాలలో పేద రైతులకు బోరు బావులు తవ్వించటానికి ఖర్చు చేసేసారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యకు చాలా మంది స్టార్స్ ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల కాలంగా దర్శకుడిగా, నటుడిగా చిత్ర పరిశ్రమకు సేవలందిస్తూ నోట్ల రద్దు తో ఏ మాత్రం చీకు చింత లేకుండా వున్న స్టార్ ఒక్క పీపుల్స్ స్టారే నేమో.