జబర్దస్త్ పై ఆధిపత్యానికి రమ్య క్రిష్ణ, పోసాని
చాలా కాలం క్రితం వారానికి ఒక సారి జెమినీ టెలివిజిన్ లో ప్రసారమయ్యే హాస్య కథనాలతో సాగే అమృతం కి అత్యధికంగా ప్రేక్షకుల సంఖ్య ఉండేది. మళ్లీ ఏ టెలివిజిన్ ధారావాహిక ఆ స్థాయిని చేరుకోలేకపోయింది. కానీ ఈ టీవీ లో ప్రతి గురు,శుక్రవారాల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రం ఆ స్థాయి గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ కార్యక్రమం లో పాల్గొన్న ఎందరో కళాకారులు ఇప్పుడు వెండి తెర నటులు అయిపోయారు అంటే జబర్దస్త్ క్రేజ్ ఏంటో అర్ధం అవుతుంది. ఆ కార్యక్రమానికి మొదటి నుంచి నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న వెండి తెర తారలు నాగ బాబు, రోజా లకు బుల్లి తెర పై గుర్తింపు పెరిగిపోయింది.
అయితే ఒక ఛానల్ లో పాపులర్ ఐన కార్యక్రమాల ప్రేరణతో ఇతర ఛానళ్ళు కూడా అటువంటి కార్యక్రమాలు రూపొందించటం సహజమే. జబర్దస్త్ వంటి పాపులర్ షోకి ధీటుగా నేటి వరకు మరే ఛానల్ పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ఆ సాహసం చేస్తుంది అని సమాచారం. ఇప్పటికే హాస్య నటులతో స్కిట్స్ ప్రదర్షింపచేసి వాటిని ఎపిసోడ్స్ గా చిత్రీకరించి సిద్ధంగా ఉంచారు అంట. త్వరలో ఆ ఛానల్ ఆ షో తాలూకా ప్రోమో ను విడుదల చెయ్యటానికి సన్నద్ధమవుతోంది. ఈటీవీ జబర్దస్త్ కి రోజా, నాగ బాబులు నిర్ణేతలుగా ఉండగా, ఇప్పుడు ప్రారంభం కాబోతున్న కొత్త కార్యక్రమానికి రమ్య క్రిష్ణ, పోసాని క్రిష్ణ మురళిలు నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు.
మరి ఈ కొత్త హాస్య కార్యక్రమం జబర్దస్త్ కి ధీటుగా నిలుస్తుందో లేక చతికిల పడుతుందో చూడాలి.