చెర్రీ తో పాటు రకుల్ ని కూడా ఎత్తేస్తున్న ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి చేత అతిధి పాత్ర చేపించి మరీ కమర్షియల్ సక్సెస్ కోసం తాపత్రయ పడ్డ బ్రూస్ లీ చిత్రం ఘోర పరాజయం చవిచూడటంతో కొంత కాలం విరామం తీసుకుని రిస్క్ చెయ్యకుండా విజయం సాధించిన కథనే రీమేక్ చెయ్యటానికి సిద్దపడి తమిళం లో సంచలన విజయం సాధించిన తన్ని ఊరువం చిత్రాన్ని తెలుగులో ధ్రువ పేరుతో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం విజయ దశమి పండుగకు విడుదల చేయలేకపోయారు. డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చేసిన ప్రకటనను, ఈ సారైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే కసితో తాను నిర్మిస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 నిర్మాణ వ్యవాహారాలను కూడా పక్కన పెట్టి థాయిలాండ్లో ధ్రువ చిత్ర సాంగ్ షూట్లో కష్టపడుతున్నాడు.
చిత్రీకరణ పని మీద విదేశం వెళ్తున్నప్పటికీ రామ్ చరణ్ తేజ్ తన శ్రీమతి ఉపాసన ను వెంట తీసుకుని వెళ్ళాడు. లొకేషన్లో రామ్ చరణ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు నిబద్దతతో పని చేస్తుండటం చూస్తుంటే తెలియని ఉత్సాహం వస్తుంది అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో తన అనుభూతిని పంచుకుంది ఉపాసన. నటుల పని ఏమాత్రం సులభతరమైన వ్యవహారం కాదు అని, సినిమాకి సంబంధించిన బృందం పడే ఇబ్బందులు, ఎదుర్కొనే ఒత్తిడులు స్వయంగా చూస్తున్నానని చెప్పి, తన భర్త తో బీచ్ లొకేషన్లలో రొమాన్స్ గీతాలలో కాలు కదుపుతున్న రకుల్ ని కూడా పొగడ్తలతో ముంచేసి ఏమాత్రం అసూయ లేని తన విశాల హృదయాన్ని ప్రదర్శించింది ఈ మెగా కోడలు.