Fri Dec 05 2025 15:40:51 GMT+0000 (Coordinated Universal Time)
పేరు మార్చేసుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రశంసల వర్షం
సాయి ధరమ్ తేజ్ మరోసారి తన పేరు మార్చుకున్నాడు! సెప్టెంబర్ 2021లో మోటర్బైక్

‘సుప్రీమ్ హీరో’ సాయి ధరమ్ తేజ్ మరోసారి తన పేరు మార్చుకున్నాడు! సెప్టెంబర్ 2021లో మోటర్బైక్ ప్రమాదం తర్వాత తన పేరును 'సాయి తేజ్'గా మార్చుకున్నాడు. మార్చి 2024లో తన అభిమానులతో తన పేరును మార్చుకోబోతున్నానని తెలిపారు. సాయి దుర్గా తేజ్ గా మరోసారి పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. తన తల్లి విజయ దుర్గ పేరు తన పేరులో ఉండేందుకు.. 'దుర్గ' అనే మధ్య పేరును చేర్చుకున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
ఇక సాయి ధరమ్ తేజ్ 'విజయ దుర్గా ప్రొడక్షన్స్' పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రకటించాడు. త్వరలో సాయి తేజ్ నిర్మాతగా మారనున్నట్లు తెలుస్తోంది. సాయి దుర్గ తేజ్ నూతన దర్శకుడు జయంత్ పానుగంటితో ఒక చిత్రానికి సంతకం చేశాడు. సంపత్ నందితో ‘గంజా శంకర్’ పేరుతో ఆయన చేసిన సినిమా కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తల్లి పేరును తన పేరులో ఉంచుకున్న సాయి తేజ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.
Next Story

