అఖిల్ మాజీ లవర్ పెళ్లి... ఎంపీ కొడుకుతో ఎంగేజ్మెంట్
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన మనవరాలు అయిన ఆమె అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాల్సి ఉంది. నాగార్జున తన పెద్ద కుమారుడు నాగచైతన్య - సమంత పెళ్లి తర్వాత చేయాలని గతేడాది ఫిక్స్ అవ్వడంతో అప్పటికే ప్రేమలో ఉన్న రెండో కుమారుడు అఖిల్ - శ్రియా భూపాల్ వివాహాన్ని ముందుగా ఘనంగా చేయాలని డిసైడ్ అయ్యాడు.
శ్రియా భూపాల్ - అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఇటలీలో వీరి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న టైంలో వీరిద్దరి మధ్య ఓ పార్టీలో మనస్పర్థలు రావడంతో పెళ్లి ఆగినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ఘటనపై అక్కినేని, జీవీకే ఫ్యామిలీల నుంచి ఎలాంటి రిప్లే రాకపోవడంతో ఏం జరిగింది ? అన్నది ఎవరి ఊహలకు వాళ్లకే పరిమితం అన్నట్టుగా జరిగింది.
తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ తర్వాత అఖిల్ కెరీర్పై కాన్సంట్రేషన్ చేశాడు. ఇప్పుడు అఖిల్ మాజీ లవర్ శ్రియా భూపాల్ మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతోంది. శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఫొటోలు బయటకు వచ్చాయి. ఇంతకు అనిందిత్ ఎవరో కాదు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు.
అనిందిత్కు మెగా ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. రామ్చరణ్ భార్య ఉపాసనకు పిన్ని కొడుకు. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. ఇక వీరి పెళ్లి ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్లో జరగనున్నట్టు సమాచారం. మొత్తానికి అక్కినేని ఇంట చిన్న కోడలిగా ఎంట్రీ ఇవ్వాల్సిన శ్రియా భూపాల్ ఇప్పుడు చేవెళ్ల ఎంపీ ఇంటి కోడలిగా అడుగు పెడుతోంది.