Sat Apr 27 2024 18:52:02 GMT+0000 (Coordinated Universal Time)
చివరి షెడ్యూల్ లో నాగచైతన్య "సవ్యసాచి"
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీ పార్ట్ ఆగస్టు 8తో పూర్తికానుంది. ఆగస్టు 15న ఫారిన్ లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 15 నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోపాటు సీజీ వర్క్ కూడా పూర్తికానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
తారాగణం
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.
Next Story