సర్కారు వారి పాటతో పరశురామ్ రేంజ్?
దర్శకుడు పరశురామ్ రేంజ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చెయ్యడమే. ఇంతకుముందు సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు చేసిన పరశురామ్ కి [more]
దర్శకుడు పరశురామ్ రేంజ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చెయ్యడమే. ఇంతకుముందు సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు చేసిన పరశురామ్ కి [more]
![Sarkaru Vari Pata Sarkaru Vari Pata](https://www.telugupost.com/h-upload/old_images/1195356-sarkaruvaripata.webp)
దర్శకుడు పరశురామ్ రేంజ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చెయ్యడమే. ఇంతకుముందు సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం సినిమాలు చేసిన పరశురామ్ కి గీత గోవిందం అనేది పరశురామ్ కూడా ఎక్సపెక్ట్ చెయ్యని బ్లాక్ బస్టర్ అవడంతో పరశురామ్ స్టార్ హీరోల కోసం కాదు కేవలం మహేష్ తో సినిమా కోసమే తెగ వెయిట్ చేసాడు. కానీ మహేష్ మాత్రం పరశురామ్ కి చుక్కలు చూపించాడు. దానితో పరశురామ్ చేసేది లేక మళ్ళీ మీడియం హీరో నాగ చైతన్య తో సినిమా ఓకె చేసుకున్నాడు. కానీ మల్లి మహేష్ పిలిచేసరికి చైతు సినిమా పక్కనెట్టేసి పరశురామ్ మహేష్ కథపై వాలిపోయాడు.
ఆ దెబ్బకి పరశురామ్ రేంజ్ మారిపోవడం పారితోషకం పెరిగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు తో అయితే పరశురామ్ కి ఓ 7 కోట్లయినా అందుకునేవాడు. ఎందుకంటే గీత గోవిందం బ్లాక్ బస్టర్ గనక. కానీ మహేష్ తో అనేసరికి పరశురామ్ పారితోషకం 10 కోట్లకి పెరిగిపోయింది. మరి మహేష్ తో సినిమా అంటే దర్శకుడికి ఓ రేంజ్ ఉండాలి. అందుకే పరశురామ్ కి నిర్మాతలు అంతిస్తున్నారు. పరశురామ్ కూడా సర్కారు వారి పాటకి 10 కోట్లు కొట్టేస్తున్నాడు. మరి ఆ రేంజ్ హిట్ మహేష్ కి కూడా ఇస్తేనే పరశురామ్ రేంజ్ మరింతగా పెరిగేది. ఇప్పటివరకు టైటిల్ అండ్ మహేష్ బ్యాక్ టాటూ లుక్ అయితే ఓకె.