Fri Mar 20 2026 21:34:13 GMT+0530 (India Standard Time)
నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

'కిర్రాక్ పార్టీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నిఖిల్ హీరోగా టీ.ఎన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముప్పై శాతం పూర్తి చేసుకుంది. ‘విక్రమ్ వేద’ ఫేమ్ శ్యాం సి.ఎస్. సంగీతం సమకూరుస్తుండగా సూర్య ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ ల పై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్నారు.
Next Story

