Mon Apr 29 2024 08:06:50 GMT+0000 (Coordinated Universal Time)
"నన్నుదోచుకుందువటే" అంటున్న సుధీర్ బాబు
సమ్మెహనం తొ తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 14న 10:02 ని.లకు టీజర్ ని విడుదల చేస్తున్నారు. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడదల తేదీని ప్రకటించనున్నారు.
నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
Next Story