వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి అంటోన్న లక్ష్మీరాయ్..

రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ లక్ష్మీరాయ్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి అంటూ ప్రేక్షకుల ముందుకొస్తుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతో కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నటీనటులు:
లక్ష్మీరాయ్, పూజిత పొన్నాడ, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు

