Sat Dec 27 2025 14:22:50 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా చూసిన కేసీఆర్ కుటుంబం

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'నవాబ్' సినిమాకు మంచి టాక్ వచ్చింది. ప్రక్షకుల్లో ఆధరణ లభిస్తుంది. మణిరత్నం మార్క్ సినిమాగా ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. సామాన్య ప్రేక్షకుల తో పాటు స్టార్ హీరోలు కూడా సినిమా మహా అద్భుతం అంటూ ట్వీట్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు మహేష్ బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, వి.వి వినాయక్ తదితరులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా ఈ సినిమాను వీక్షించి సినిమా చాలా బాగుందని, ప్రతి ఒక్క కుటుంబం చూడాల్సిన సినిమా అని ప్రశంసించారు.
Next Story

