Sat Jan 31 2026 17:51:21 GMT+0000 (Coordinated Universal Time)
మహేశ్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి..?

భారత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించి సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించాడు మహేశ్ బాబు. వంశీ పైడపల్లితో తన తర్వాతి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్థుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే, మహేశ్ బాబు షూటింగ్ జరుగుతున్న సెట్ కు ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి, మహేశ్ బాబుని కలిసి కాసేపు ముచ్చటించి వెళ్లారని తెలుస్తోంది. కలిసిన వ్యక్తి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అని ఫిలింవర్గాల్లో టాక్ వినపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మహేశ్ బాబుని కలిశారంట.
Next Story

