Tue Jan 20 2026 10:40:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివసించిన చెన్నైలోని

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివసించిన చెన్నైలోని నుంగంబాక్కంలోని వీధి పేరును అధికారికంగా మార్చారు. ఇక నుంచి నుంగంబాక్కంలోని కమ్దార్ నగర్ ప్రధాన రహదారిని అధికారికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనున్నారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ రోడ్డు పేరు మార్పును సూచిస్తూ బోర్డును ఆవిష్కరించారు.
సంగీతానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలను పురస్కరించుకుని పేరు మార్చారు. ఈ కార్యక్రమంలో హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు, చెన్నై కార్పొరేషన్ అధికారులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జూన్ 4, 1946న ఆంధ్రప్రదేశ్లోని కొంటెమ్మపేటలో జన్మించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం 1960వ దశకంలో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. గణేశన మదువే అనే తమిళ చిత్రంతో ఆయన విస్తృత ఖ్యాతిని పొందారు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా బహుళ భాషలలో 40,000 పాటలను పాడారు. ఆయన అద్భుతమైన కెరీర్ లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్, పద్మశ్రీ సొంతం చేసుకున్నారు. 2021లో మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కరించారు. SP బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19 బారిన పడ్డారు.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా 2020లో మరణించారు.
Next Story

