Sun May 05 2024 06:15:02 GMT+0000 (Coordinated Universal Time)
గోవా చెక్కేసిన చై-సామ్
టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. దంపతులు ఒకరి ఫోటోలు ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో పెడుతుంటారు. వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఆరు నెలల క్రితం గోవాలోని ఓ ప్రముఖ హోటల్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు మళ్లీ హాలీడే ట్రిప్ లో భాగంగా గోవా వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో అవి ఇప్పుడు వైరల్ కావడంతో పాటు లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. ఇది చేస్తేనే తెలుస్తోంది అభిమానుల్లో ఈ జంటకు ఉండే క్రేజ్.
Next Story