Sun Dec 07 2025 18:57:33 GMT+0000 (Coordinated Universal Time)
నాగార్జున డ్రాప్... తారక్ డుమ్మా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప్రముఖులు హాజరు కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప్రముఖులు హాజరు కావడం లేదు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జున జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన ఈ భేటీకి హాజరవుతారని అందరూ భావించారు. సీఎంవోకు వచ్చిన లిస్ట్ లో కూడా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ పేర్లున్నాయి. కానీ ఈ ఇద్దరూ మాత్రం జగన్ తో భేటీకి హాజరు కావడం లేదు.
వ్యక్తిగత కారణాలేనా?
నాగార్జున వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదని చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకాకపోవడానికి వ్యక్తగత కారణాలా? రాజకీయ కోణంలో హాజరుకాలేదా? అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందకపోవడం వల్లనే హాజరు కావడం లేదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, నారాయణమూర్తిలు హాజరవుతున్నారు.
Next Story

