Thu Mar 19 2026 08:50:54 GMT+0530 (India Standard Time)
Padma Awards: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు
నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు

నటుడు నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది. కళా రంగానికి చేసిన సేవలకు గాను 2025లో నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు.
నందమూరి బాలకృష్ణ, జూన్ 10, 1960న మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) జన్మించారు. లెజెండరీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆరవ కుమారుడు. బాలకృష్ణ 1974లో "తాతమ్మ కల" చిత్రంతో 14 సంవత్సరాల వయస్సులో బాల కళాకారుడిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 100 కంటే ఎక్కువ చిత్రాలలో బాలకృష్ణ నటించాడు. తన డైనమిక్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీకి ఆయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. “మంగమ్మగారి మనవడు” (1984), “ముద్దుల మావయ్య” (1989), “సమరసింహా రెడ్డి” (1999), “అఖండ” (2021) గొప్ప విజయాలను అందుకున్నాడు. బాలకృష్ణ తన సినీ కెరీర్తో పాటు, 2014 నుండి హిందూపూర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా సేవలు చేస్తున్నారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు.
Next Story

