సినిమా ఆఫీసు ప్రారంభించిన తలసాని, వినాయక్
'కృష్ణ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ కు నిర్మాతగా పరిచయమయ్యారు కాశీ విశ్వనాధమ్. రవితేజ హీరోగా, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'లక్ష్మీ నరసింహ విజువల్స్' పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజై అప్పట్లో కమర్శియల్ గా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎందరో స్టార్ హీరోల సినిమాలను తెలుగు రాష్ర్టాల్లో 'శ్రీరామకృష్ణ పిక్చర్స్' అనే డిస్ర్టీబ్యూషన్ సంస్ధ ద్వారా రిలీజ్ చేశారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'నాయక్' చిత్రాన్ని గుంటూరు ఏరియా.. గోపీచంద్ హీరోగా రూపొందిన 'శంఖం', నితిన్ నటించిన 'దిల్' సినిమాలను ఈస్ట్, వెస్ట్ గోదావరి ఏరియాలు డిస్ర్టిబ్యూషన్ ఈ సంస్ధ ద్వారానే జరిగింది. ఆ మధ్య రవితేజ హీరోగా నటించిన 'కిక్' సినిమాను పలు పంపిణీ సంస్థలతో కలిసి డిస్ర్టిబ్యూట్ చేశారు.