ధృవను మరో బ్రూస్లీ కాకుండా చూసిన రామ్ చరణ్
![ధృవను మరో బ్రూస్లీ కాకుండా చూసిన రామ్ చరణ్ ధృవను మరో బ్రూస్లీ కాకుండా చూసిన రామ్ చరణ్](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/10/ramcharan.jpg)
తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదల సెంటిమెంట్స్ ని పట్టించుకునే సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సెంటిమెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తాడో లేదో కానీ తన అభిమానుల్లో కొందరికైనా ధ్రువ సినిమా విడుదల వాయిదా పడటం కచ్చితంగా ఆనంద దాయకమే. రామ్ చరణ్ - క్రిష్ణ వంశి ల కలయిక లో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే 2014 అక్టోబర్ నెలలో విడుదలై ఒక మోస్తరు చిత్రం గానే మిగిలిపోయింది. ఇక 2015 అక్టోబర్ నెల లో విడుదలైన రామ్ చరణ్ గత చిత్రం బ్రూస్ లీ లో మెగా స్టార్ చిరంజీవి అతిధి పాత్రలో మెరిసి అభిమానులను పలకరించినప్పటికీ ఆ చిత్రం ఘోర పరాజయం చెందింది.
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న ధ్రువ చిత్రం చిత్రీకరణ ప్రారంభం రోజునే చిత్ర బృందం అక్టోబర్ లో విడుదల ఉంటుంది అని ప్రకటించింది. కానీ రామ్ చరణ్ తన తండ్రి నటిస్తున్న ఖైదీ నెం.150 చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించటం కారణంగా ఈ చిత్ర చిత్రీకరణ ఆలస్యం జరిగి విడుదల డిసెంబర్ కి వాయిదా పడింది. అభిమానుల్లో రామ్ చరణ్ అక్టోబర్ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి ఊరట లభించింది. ఈ విజయ దశమి సందర్భముగా టీజర్ తో సరిపెట్టనుంది ధ్రువ యూనిట్.
సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ధ్రువ చిత్రం తమిళం లో జయం రవి నయనతార జంటగా నటించిన తన్ని ఊరువం కి రీమేక్. గీత ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.